May Day celebrations under the auspices of labor unions in Pakala.
వార్తలు

పాకాల లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు.

బాలాజీ ఆటో స్టాండ్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి,చలివేంద్ర ప్రారంభించిన రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి. హేమలత. ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ ఆధ్వర్యంలో జెండా ఎగరేసిన ఇ. మధుసూదన్ రావు, పంచాయితీ కార్మికుల ఆధ్వర్యంలో జెండా ఎగరవేసిన సర్పంచ్ కస్తూరి. సి ఐ టి యు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పి.హేమలత మాట్లాడుతూ కార్మిక ,కర్షక మైత్రి ద్వారానే దేశంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం జరుగుతుందని అన్నారు.ఒక వైపున కార్మిక హక్కులు కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తూ వుంది.కార్మికులు ప్రాణాలు బలిదానం చేసి సాధించిన 8గంటల పని దినాన్ని నేడు12గంటలనుండి 15గంటలకు పెంచుతూ చట్టం చేసింది. ఇటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా భూములను అప్పణంగా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది.దీనికి వ్యతిరేకంగా మే 20 తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మికులు -కర్షకులు కలిసి జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మండల నాయకులు ఇ.మధుసూదన్ రావు మాట్లాడుతూ దేశంలో జరిగిన ఉగ్రవాదు దాడిని ఖండిస్తూ, దేశంలోపల జరుగుతున్న నక్సల్స్ హత్యల్ని ఖండిస్తూ , ప్రజలంతా ఈ బీజేపీని ఇంటికి పంపాలని లేకపోతే సామాన్య మానవులకు బ్రతికే అవకాశం అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఏ. భారతి, సుగుణ, బాలాజీ ఆటో స్టాండ్ నాయకులు రమేష్ ,ఆనంద్ దర్గా ఆటో స్టాండ్ నాయకులు వేణు, బిల్డింగ్ వర్కర్స్ నాయకులు గణేష్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ నాయకులు తంబి, వెంకటేష్ ,గుణశేఖర్, మురళి, డాక్టర్ సాంబశివ తదితరులు పాల్గొన్నారు.