ఏనుగుల విధ్వంసం నుండి పంటను – రైతు ప్రాణాలను కాపాడండి!
రేణిగుంట మండలం మామండూరు గ్రామానికి చెందిన 130 ఎకరాలు మామిడి తోట చందూర, బెంగళూర ,బెనిష, నీలం, రుమానియా రకాల మామిడి కాయలు చేతికొచ్చిన పంటను తినడానికి చెట్లు విరచి 20 రోజులుగా ధ్వంసం చేస్తున్నాయని రైతుల కూడా ప్రాణహాని ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు.జిల్లా ఫారెస్ట్ అధికారులు, జిల్లా కలెక్టర్ ,శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కుగానీరైతుల బాధలను కష్టాలను అర్థం చేసుకొని రైతులకు నష్టపరహారం ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు రంగయ్య హేమలత సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కన్వీనర్ కొండ్రెడ్డి హరినాథ్ రేణిగుంట రూరల్ కార్యదర్శి సెల్వరాజ్ రైతులను పరామర్శించి మామిడి తోటను పరిశీలించడం జరిగింది .వెంటనే క్రంచి కొట్టి ఏనుగులు గుంపు రాకుండా జిల్లా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవాలని అప్పటికి వస్తుంటే అటవీ సరిహద్దు ప్రాంతాల్లో సోలార్ పెంచింగును ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో రైతులు రోడ్డు రహదారి పై గ్రామస్తులు కూర్చొని నిరసనకు దిగుతామని ఈ ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను హెచ్చరించారు.
పెనుమూరు హేమలత,
(జిల్లా ప్రధాన కార్యదర్శి- ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం) తిరుపతి జిల్లా.
సెల్: 9490300529