Compensation of Rs 10 lakh should be paid to the farmer who died in an elephant attack
పత్రికా ప్రకటనలు వార్తలు

ఏనుగు దాడిలో మృతి చెందిన రైతుకు నష్టపరిహారం 10 లక్షలు చెల్లించాలి

 

చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ కొత్తపల్లి గ్రామ సమీపంలో దాసరగూడెంకు చెందిన సిద్దయ్య ( 65) ను ఏనుగు తొక్కి చంపేయడం తో ఆ కుటుంబం వీధిన పడ్డది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నిదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత అన్నారు. ఇప్పటికీ చంద్రగిరి మండలం, పులిచర్ల మండలం ,ఇప్పుడు చిన్నగొట్టిగల్లు మండలాలోముగ్గురు రైతులు చనిపోయారు. రెగ్యులర్గా ఏనుగుల వలన పంట నష్టపోవడమే కాకుండా రైతులు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్న పరిస్థితి. అటవీశాఖ మంత్రి ఏనుగుల్ని అరికెడతానని అది చేస్తా ఇది చేస్తాననిప్రగల్బాలు పలకడం తప్ప ఆచరణలో శూన్యం అని అర్థమవుతున్నది. అటవీ శాఖ ఏనుగుల్ని అరికట్టడంలో విఫలం చెందడం మే కాకుండా నష్టపరిహారం చెల్లించడంలో కూడా న్యాయం జరగడం లేదు .ఈరోజు పంట కోసం రైతులందరూ కంచవేసుకుంటున్న పరిస్థితి ఉంది. పంట నష్టపోతే నష్టపరిహారం కూడా నామమాత్రంగానే చెల్లిస్తున్నారు .కానీ వేలాది రూపాయలు పెట్టి ఫెన్సింగ్ వేసుకున్న వాటిని ఏనుగుల తొక్కి విరిచేస్తుంటే దానికి నష్టపరిహారం కూడా చెల్లించడం లేదు .నాకు తెలిసి కుప్పంమండలం రాములుగుట్ట చేన్లుఅనే గ్రామంలో సోలార్ విద్యుత్ కంచె వేసి దాదాపు 20సంవత్సరాలు గడిచింది.దాని తర్వాత ఏనుగుల దాడి అరికట్టబడింది. ఆ విధమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు.రైతుల ప్రాణాలు అన్ననూ, రైతుల పంట అన్ననూ లెక్కలేని తనం కనిపిస్తున్నది. భాకరాపేట అడవి చుట్టూ కందకాలతవ్వారు.సంవత్సరం తిరక్కుండా నే కందకాలు పూడి పోయాయి. తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఏనుగుల్ని తెప్పిస్తాం ఒంటరి ఏనుగుల్ని గ్రామాల్లోకి రాకుండా కాపాడుతామని చెప్పిన ఉప ముఖ్యమంత్రి ఈరోజు సమాధానం చెప్పాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు. ఏనుగుల్ని పంటలోకి రాకుండా చూసుకోవలసిన బాధ్యత అటవీశాఖ మరియు ప్రభుత్వానిదని వీటి వల్ల రైతులెందుకు నష్టపోవాలని మీ నష్టపరిహాల  కోసం రైతుల ఎదురు చూడటం లేదని ఆమె దుయ్యపెట్టారు. కాబట్టి వెంటనే ఆటవీ ప్రాంతమంతా సోలార్ ఫెన్సింగ్ తో మీ ఏనుగుల్ని మీరు భద్రపరచుకోవాలి లేకపోతే భవిష్యత్తులో రైతులతో పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *