i have mortgage mangalsutra
పత్రికా ప్రకటనలు వాణిజ్య వార్తలు వ్యవసాయం

మంగళ సూత్రాలను తాకట్టు పెట్టాను

 

ఎరువులు పురుగు మందులు అన్ని అప్పులే చివరికి చెవి దిద్దులు ముక్కుపుడక తాకట్టు పెట్టి కూలి డబ్బులు ఇచ్చాము ప్రతి సంవత్సరం కొంతమంది కూలీలు కూడా డబ్బులు ఇవ్వలేక మోహo చాటు వేస్తున్నాం .
తాకట్టు పెట్టిన బంగారం వెంటనే విడుదల చేయకపోతే బంగారం ఇవ్వలేదని బంగారం తాకట్టు పెట్టుకున్న వ్యాపారి కబురు చేశారు.

ఇళ్లల్లో పొగాకు రోడ్ల మీద మనుషులు పశువులు జీవాలు ఇవి బాపట్ల జిల్లా పర్చూరు ఇంకొల్లు మరికొన్ని చుట్టుపక్కల మండలాల్లోని గ్రామాలన్నిటిలో బ్లాక్ బెర్లీ పొగాకు సాగుచేసిన రైతులు కౌలు రైతుల పరిస్థితి.

రాష్ట్రంలో దాదాపు లక్ష ఎకరాలకు పైగా నల్లబెర్లీ పొగాకు వేశారు వీరిలో 80% పైగా కౌలు రైతులే ఉన్నారు .గత రెండు సంవత్సరాల్లో తెగుళ్లు వచ్చి మిర్చి వేసిన రైతులు , కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు మరోవైపు గత సంవత్సరం నల్లబెర్లి పొగాకు పంట క్వింటా 15 నుండి 18 వేలకు అమ్ముడుపోయింది, చివరకు అడుగులు (నాసిరకంగా వున్నా )కూడా 12 వేలకు బంగారం లాగా వ్యాపారులు కళ్ళకు అద్దుకుని కొనుక్కుపోయారు. అలాగే జి పి ఐ ; ఐ టి సి తదితర కంపెనీల ప్రతినిధులు ,వ్యాపారులు ఒకటికి నాలుగు సార్లు గ్రామాలకు రైతుల చుట్టూ తిరిగి మొత్తం పోల మంతా నల్ల బెర్లీ పొగాకు వేయమని రైతులను కౌలు రైతులను ప్రోత్సహించారు . కొంత నల్లబెర్లీ మరికొంత వెయిట్ బెర్లీ పొగాకు లేదా మిర్చి వేస్తారేమో అలా వేయవద్దు మొత్తం నల్లబెర్లీ వేయండి అని చెప్పారు పైగా గత సంవత్సరం రేటు మరో రెండు మూడు సంవత్సరాలు నిలకడగా ఉంటుందని వ్యాపారులు రైతులకు కౌలు రైతులకు భరోసా ఇచ్చారు . దానితో కౌలు రెట్లు పెరిగిన లెక్కచేయకుండా పొలాన్ని కౌలుకు తీసుకున్నారు రెగ్యులర్ గా కౌలు చేసే కౌలు రైతులే కాకుండా ఈ మధ్యకాలంలో సంచార జాతులుగా చెప్పుకునే యానాది ఎరుకల తదితర సామాజిక తరగతులకు చెందిన పేదలకు కూడా పొలాలు కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశారు .పంట బాగా పండితే గత సంవత్సరం లాగా ధర వస్తే అప్పులన్నీ తీర్చుకోవచ్చు అప్పుల నుండి బయటపడి ఊపిరి పీల్చుకుందామనుకున్నారు .కానీ నల్లబెర్లీ పొగాకు వేసిన రైతులు కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది ఒక ఎకరా నల్లబెర్లీ పొగాకు వేయటానికి కనీసం ₹ 1,50,000/_ ఖర్చు అయింది .కౌలు రేట్లు 25వేల నుండి 35 , 40 వేల వరకు పెరిగింది . గుచ్చటానికి 40వేలు ,ట్రాక్టర్ తో దుక్కి కి 10 వేలు ఎరువులకు 10 వేలు 75 సంవత్సరాల స్వాతంత్యానంతరం కూడా పంట పండించుకోవడానికి నీళ్లకు కనీసం 10 వేలు రూపాయలు ఖర్చు చేశారు. ఎద్దులతో సాళ్ళకి 5000 నారుకు పదివేలు ఇతరత్రా అన్ని కలుపుకుని ఎకరాకు సాగు చేయడానికి ₹1,50,000 /- పైనే ఖర్చు అయింది . గత సంవత్సరం ఎకరాకు సరాసరిన 18 క్వింటాళ్ల పొగాకు దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం ఖర్చులు పెరగడంతో పాటు దిగుబడి కూడా తగ్గింది ఈ సంవత్సరం సగటు పది నుండి 13 క్వింటాళ్ళ దిగుబడి ఉంటుంది అని రైతులు అంచనా వేస్తున్నారు గత సంవత్సరం అత్యంత ఎక్కువ ధర పొందిన నల్లబెర్లీ పొగాకు రైతుల పరిస్థితి తారు అయింది గత సంవత్సరం క్వింటా 18000 ధర వస్తే నేడు అదే పంట కేవలం 3000 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది కొన్ని ప్రాంతాలలో అసలు కోనలేము అని ప్రకటించి రైతులను వ్యాపారులు ఆందోళనకు గురి చేస్తున్నారు కొన్ని గ్రామాల్లో పొగాకు చూసి నాణ్యత తేమశాతం అన్ని సక్రమంగా ఉన్నాయని పాస్ చేసి మళ్లీ తిరస్కరిస్తున్నారు సాధారణంగా జనవరి నుండి బ్లాక్ బెర్లీ పొగాకు కొనుగోలు ప్రారంభం అవటం ఆనవాయితి .కానీ ఈ సంవత్సరం ఆ ఆనవాయితీ దాటి 120 రోజుల గడిచిన దిక్కు ముక్కు లేకుండా రైతులు పొగాకు ఎలా అమ్ముకోవాలా అని ఎదురుచూస్తున్నారు కంపెనీలు దళారులు కుమ్మక్కై బ్లాక్ బెర్లీ పొగాకు సాగు చేసిన రైతులు కౌలు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మీరు ఆందోళన చేస్తే ధర మరింత తగ్గుతుంది కొనటం ఇంకా ఆలస్యం అవుతుంది అని కంపెనీల ఏజెంట్లతో ప్రచారం చేయిస్తున్నారు .పర్చూరు మండలం చిన్న నందిపాడు గ్రామంలో బ్యాంక్ అధికారులు పంట రుణాలు కట్టాలని లాయర్ నోటీసులు పంపించారు ఐదుగురు సభ్యులు ఉన్న జాయింట్ లైబిలిటీ గ్రూపు 2.5 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటే నేడు 4.74 లక్షల రూపాయలు అసలు వడ్డీ కలిపి అయింది కట్టకపోతే కోర్టుకు ఈడుస్తామని న్యాయవాదులతో నోటీసులు పంపించారని ఆ గ్రామ కౌలు రైతులు సింగారావు , కోట మరియదాసు , కట్టా సూర్యo తెలిపారు . చెవిలో ఉన్న పోగులు ముక్కుకున్న దిద్దులు మెడలో ఉన్న మంగళ సూత్రాలు తాకట్టుపెట్టి కూలి డబ్బులు చెల్లించామని దగ్గుపాడు గ్రామంకి చెందిన ఫకీర్ సాహెబ్ ,పెద్ద సుబ్బయ్య చెప్పారు అయితే తాకట్టు పెట్టుకున్న వ్యాపారి గడువు అయిపోతుందని వెంటనే డబ్బులు కట్టి బంగారం విడిపించుకోకపోతే మీ బంగారం మీకు దక్కదు అని వ్యాపారులు కబురు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు గతంలో కొంత పొగాకు కొంత మిర్చి వేసే వాళ్ళుము. ఏదో ఒక పంట ముందు అమ్ముకుని కూలి డబ్బులిచ్చి అప్పులు కొంతైనా తీర్చుకునే వాళ్ళం .కంపెనీ వాళ్ళు చెప్పిన మాట నమ్మి అంతా బ్లాక్ బెర్లీ పొగాకు వేసి కూలి డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నాం. అప్పుల వాళ్ళు మీద పడుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నామని వంకాయలపాడు గ్రామానికి చెందిన రామలింగారెడ్డి వెంకట్రెడ్డి , కొండయ్య , రఘు , మురళి తదితరులు దిగాలుగా చెప్పారు . ఈ పరిస్థితికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరల కోసం బడ్జెట్లో కేటాయింపులు సున్నా చేయటం అలాగే కంపెనీలు కుమ్మక్కై ధరలు పడవేయటం కంపెనీల మాయాజాలాన్ని కంట్రోల్ చేయాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంపెనీలకు తలవగ్గాయి .పొగాకు సాగు చేసిన రైతుల్ని పట్టించుకోలేకపోయాయి కంపెనీలకు అవసరమైన అనేక సౌకర్యాలు ప్రభుత్వాలు అందిస్తున్నాయి . పంటలు సాగు చేస్తున్న రైతులకు కౌలు రైతులకు హామీ ఇచ్చినట్లు అన్నదాత సుఖీభవ డబ్బులు నేటికీ 20వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు పాత కౌలు చుట్టాలు రద్దుచేసి కొత్త కౌలు చట్టం తీసుకొచ్చి కౌలు రైతులకు రక్షణగా అండగా ఉంటామన్న హామీ ఇంతవరకు ఆచరణ రూపం దాల్చలేదు పాత ప్రభుత్వం టెక్నాలజీని సరిగా ఉపయోగించలేదని పంటను కాపాడుకోవడానికి అవసరమైన పరికరాలు పదాలు ఏమీ ఇవ్వలేదు మేము అవన్నీ ఇచ్చి రైతన్నను ఆదుకుంటానన్న హామీ నీటి మీద రాతలాగానే ఉండిపోయింది పొగాకు పండించిన రైతులను గాలికి వదిలేశాయి అన్ని రకాల పొగాకు పంటలను పొగాకు బోర్డు పరిధిలోకి కేంద్రం తీసుకురాలేకపోవడం ఫలితంగా ప్రభుత్వాలు కంపెనీలను కంట్రోల్ చేయటం కాకుండా కంపెనీలే ప్రభుత్వాలను మంత్రులను కంట్రోల్ చేస్తున్నాయి ఫలితంగా ఈ సంవత్సరం నల్లబెర్లీ పొగాకు పండించిన రైతులు కౌలు రైతులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కళ్ళ ముందు అన్నీ ఉన్నా తినడానికి మనసురాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు వాతావరణంలో వచ్చిన మార్పులు గాలులు చిన్నచిన్న వర్షాల వల్ల మానసిక ధైర్యాన్ని కొద్ది కొద్దిగా కోల్పోతున్నారు .

కాబట్టి ప్రభుత్వాలు సభ్య సమాజం కూడా మనకందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు అండగా ఉండాలి రైతాంగం కూడా ఒకరికొకరు చేయి కలిపి ఐక్యమై ఆందోళనే ఆయుధంగా పోరాడాలి . ఢిల్లీ రైతాంగ ఉద్యమ స్ఫూర్తితో ఐక్యంగా కదిలి నల్లబెర్లీ పొగాకు కనీసం గత సంవత్సరం రేటు అన్న ఆందోళన చేసి సాధించుకోవాలి ఆందోళన పోరాటాలలో రైతులు కౌలు రైతులు పాల్గొని ప్రభుత్వాల మొండితనాన్ని కంపెనీల దోపిడిని ఎదుర్కోవటానికి పోరాటమే పరిష్కారంగా ముందుకు రావాలి

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *